Sunday, 13 September 2015

మీరే జాతి..?

గొర్రెన్ని గొర్రె తినదు..
కాకిని కాకి పొడుచుకు తినదు..
చివరికి పులిని పులీ తినదు..
మనిషిని మనిషీ తినడు..
మరి
విశాఖ వ్యాపారులూ..
మీరే జాతి..?
పిల్లలు తాగే పాలు లీటరు 70 రూపాయలా..
వృద్దులు తాగే మంచినీరు బాటిలు 50 రూపాయలా..
అత్యవర సర్వీసులకి ఉపయోగించే లీటరు పెట్రోలు 150 రూపాయలా..
కాయగూరలు కిలో 100 పైనేనా..
మీరేమైనా పాకిస్తాన్ నించి వచ్చారా..?
అమెరికాలో వీటిని తయారు చేశారా..?
దోపిడీలు జరుగుతున్నాయంటే జరగవూ..
కడుపుమండిన బాధితుడు ఏమైనా చేస్తాడు..
శవాల మీద డబ్బులు ఏరుకునే నైజం మీకు ఎక్కడిది..?
మానవత్వం మరిచిన మీరు..
మీరు మనుష్యులైతే కాదు.. నో డౌట్
జనం తిరగబడక ముందే మేలుకోండి..
ఆపన్నులను ఆదుకోండి.. మనుష్యులనిపించుకోండి..

విశాఖలో అన్ని దుకాణాలు..
నిత్యావసర వస్తువుల నిల్వలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
అధికారుల పర్యవేక్షణలోనే సరుకులు అమ్మించాలి..
అప్పుడు గానీ వ్యాపారుల ధనదాహానికి అడ్డుకట్ట పడదు..

--నాగ్

హుదుత్ తుపాను సమయంలో ధరలు పెంచిన వ్యాపారుల తీరుకు నిరసనగా రాసింది..

అక్టోబరు 2014

No comments:

Post a Comment