Tuesday 31 January 2017

ఖో ఖో.. మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు సతీష్

జనవరి 29, 2017, రాత్రి ఎనిమిది గంటల సమయం..
ఇండియా - ఇంగ్లాండ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
ఇప్పటికే ఒక మ్యాచ్ ని కోల్పోయిన కొహ్లీ సేన చాలా పట్టుదలగా ఆడుతోంది. కానీ చాల తక్కువ స్కోర్ కే ఇండియా బ్యాట్స్ మెన్ పెవిలియన్ కి వచ్చేశారు.
తక్కువ స్కోర్ లక్ష్యంగా బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ విజయం వైపు దూసుకు పోతోంది.
మన బౌలర్స్ ఇంగ్లాండ్ ని కట్టడి చేయడానికి స్లాగ్ ఓవర్స్ చమటోడ్చుతున్నారు. ప్రతి బంతీ ఉత్కంఠ.
సహజంగానే ఇండియాలోని క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోయారు. క్రికెట్ చూస్తున్నారు.
విజయం ఇండియా- ఇంగ్లాండ్ మధ్య దోబూచులాడుతోంది.
సరిగ్గా..
అదే రోజు..
అదే సమయంలో
అదే ఇంగ్లాండ్ క్రీడాకారులకు మరోచోట చమటలు పడుతున్నాయి.
ఇండియా కుర్రాళ్లు.. తెల్ల కుర్రాలతో ఒక ఆట ఆడేసుకుంటున్నారు..
ఆ ఆటే ఖో ఖో..
న్యూ ముంబాయి స్టేడియంలో ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్ టెస్ట్ జరుగుతోంది
ఆది నుంచీ మన క్రీడాకారులు ఇంగ్లాండ్ పై ఆధిపత్యంతో ముందుకు దూసుకు పోయారు.
అయిదు పాయింట్లతో విజయం సాధించారు.
ఈ విజయంలో ఆంధ్ర ప్రదేశ్ కు అందునా తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం మండలం విరవ కుర్రాడు యాళ్ల సతీష్ ఆల్ రౌండ్ ప్రతిభ చూపించాడు.
మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు సతీష్
ఇతను పిఠాపురం మహరాజా డిగ్రీ కళాశాల(ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల) లో బికామ్ చదువుతున్నాడు.
అయితే దురదృష్టం.. ఇండియాలోనే కాదు చివరికి విరవ గ్రామంలో కూడా జనాలకి ఈ విజయం తెలీదు.
ప్రసార మాథ్యమాల్లో ఏ మూలా ఈ విజయానికి చోటు దక్కలేదు
గెలిచింది అంతర్జాతీయ మ్యాచ్ అయినా స్థానికంగా కూడా విలువ లేదు.
28 రాష్ట్రాల క్రీడాకారులు పోటీ పడితే .. ఎంపికైన 15 మందిలో ఒక్క ఆంధ్రుడికి స్థానం దక్కడం.
అదీ మా పిఠాపురం మండలం వాడికి ఆ గౌరవం దక్కడం నిజంగా చాలా గర్వ కారణం.
సతీష తండ్రి సత్తిబాబు గారు, సైకిల్ మీద వస్తువులు అమ్మే వ్యాపారి. తల్లి సత్యవతి గారు హౌస్ వైఫ్
సతీష కోచ్ పీఈటీ రాంబాబు గారు.
సతీష్ ఇప్పటికి 16 సార్లు రాష్ట్రం తరుపున ఆడాడు
మూడు బంగారు పలు రజత పథకాలు సాధించాడు
సతీష్ త్వరలో ఇంగ్లాండ్ లో జరగబోయే ఖో ఖో టెస్ట్ ల్లో ఆడనున్నాడు
శుభాకాంక్షలు సతీష
మరియు
ఆల్ ది బెస్ట్
-- సరిదే నాగ్
ఫోటో : ఖో ఖో క్రీడాకారుడు యాళ్ల సతీష్ , పిఠాపురం మండలం విరవ