Monday 14 November 2016

జ్వాలాతోరణం

సర్వ పాపహరం..
నరక బాధా విముక్తి కారకం..
జ్వాలాతోరణం


సాగర మథనం సమయంలో పాలకడలి నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలిపుతాడు. అయితే ఆలాహలం మంటలకు శివునికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజసిద్దమైన బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు ఆలాహలం మంటలు వల్ల ఏమీ కాకుండా వుండాలని దానికి ప్రతిగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాటుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది. శివునికి ఏమీ కాలేదు. ఈ కారణంగా ప్రతి కార్తిక పౌర్ణమి రోజునా పరమేష్టి పరమశివుని సహా జ్వాలాతోరణం దాటుతుంది
ఈ తోరణాన్ని కొత్తగడ్డితో చేస్తారు. కొత్త గోగునారని తాడుగా పేని రెండు వేప చెట్లకు మధ్యగా తోరణంలా కడతారు. కొత్తగడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలోగా స్వామి వారిని మూడు మార్లు తోరణం కిందుగా తీసుకు వెళ్తారు.
భక్తులు ఈ జ్వాలతోరణం కిందిగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకం. కైలాస ద్వారం తెరుకుంటుందని చెబుతారు
అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదెల్లో వేస్తారు. పశువులకు తినిపిస్తారు దీనివల్ల పాడి పంటలు సమృద్దిగా లభిస్తాయని నమ్ముతారు.
గడ్డి మండగా మిగిలిన నుశిని బొట్టులా పెట్టుకుంటారు. దీనివల్ల నరదిష్టి, భూత ప్రేతాత్మల పీడా వుండని నమ్మకం.
ఇది అంతా పెద్దలు చెప్పిందే దీనిలో తర్కానికి చోటు లేదు
పాటిస్తే వచ్చే నష్టమూ లేదు. కానీ తోరణం దాటేప్పుడు మెళకువగా లేకపోతే అగ్నిప్రమాదాలు జరగొచ్చు.
ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ వుంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతారు

-- సరిదే నాగ్
ఫోటోలు పాదగయా క్షేత్రం పిఠాపురం లో జ్వాలా తోరణం

-- సరిదే నాగ్

పాదగయా క్షేత్రంలో జ్వాలాతోరణం

No comments:

Post a Comment