గోదారి ప్రజలు.. కోనసీమ వాసులకు మాత్రమే ప్రకృతి ఇచ్చిన మరో వరం చీరమేను
సేమియాలా తెల్లగా పొడవుగా కనిపిస్తున్నవి చేపలు.చేప పిల్లలు
సేమియాలా తెల్లగా పొడవుగా కనిపిస్తున్నవి చేపలు.చేప పిల్లలు
వీటిని సేరుమేను, చీరమేను, చిరుమేను అని పిలుస్తారు.
గోదావరి తీరంలోని ప్రజలకు మాత్రమే లభించే మరో మత్స్య సంపద ఈ చీరమేను.
ఇవి ఒక జాతి చేపల పిల్లలు. ఎక్కువగా గోదావరి ఎర్రనీరు వచ్చే సమయంలో ఈ చీరమేను లభిస్తుంది. దసరా నుంచి దీపాలవళీ వరకూ ఇవి లభిస్తాయి.
మత్స్యకారులు వీటిని రంగుల చీరలు వలలా చేసి పట్టడం వల్ల వీటిని చీరమేనులు అంటారు.
అతిచిన్న చేపలు కావడం వల్ల ఇవి సాదారణ వలలకు దొరకవు.
గుంపుగా వేలు లక్షల సంఖ్యలో సంచరించే చేపల్ని మత్స్యకారులు పట్టి అమ్ముతారు.
అలాగే అతి చిన్న శరీరం కలిగి వున్నందున్న వీటిని చిరుమేను అని కూడా అంటారు.
ఇంకో విశేషం వీటిని సోల, తవ్వా, శేరు లెక్కల్లో అమ్ముతారు.
ఒక శేరు రూ. వేయి వరకూ పలుకుతోంది. శేరుల లెక్కన అమ్ముతారు కాబట్టి వీటిని శేరుమేను అని కూడా పిలుస్తారు. గతంలో కుంచం చీరమేను రూ.3వేలు వుండేది.
పులసకు ఎంత ప్రాశస్త్యం వుందో గోదావరి తీరంలో చీరమేనుకూ అంతే డిమాండ్ వుంది
క్యారేజీలు, బిందెలల్లో వీటిని తెచ్చి అమ్ముతారు.
చీరమేనుతో మషాలా పెట్టి పిట్టు వండుతారు, గారెలు చేస్తారు.
చాలా రుచిగా వుంటుంది. దీనిని వండితే బాసుమతి బియ్యంతో బిరియానీ చేసినట్టుగా వుంటుంది.
అంత రుచీ వుంటుంది. గారెలైతే చెప్పక్కర్లేదు.. అద్భుతమైన రుచి. అందుకే అంత రేటు.
-- సరిదే నాగ్
ఫోటో : బిందె, బకెట్ల లో చీరమేను, సోల, తవ్వా లెక్కల్లో చీరమేను అమ్ముతున్న మత్య్సకార మహిళ
నోట్ : కాపీ చేయొద్దు, షేర్ చేసుకోవచ్చు
No comments:
Post a Comment