Saturday 22 October 2016

ఊరు 'చివరి' ఫోటోవు.. Sez village

ఊరు 'చివరి' ఫోటోవు..
అందరికీ ఎలా అర్థం అయినా..
నిజమైన అర్థం తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం రావివారి పోడు గ్రామస్తులకు మాత్రం ఖచ్చితంగా తెలుసు.
అవును ఇది ఆ ఊరి శివర తీసినదే..
కానీ ఇదే ఆ ఊరికి చివరి ఫోటోవు అయినా ఆశ్చర్యం లేదు
రావివారి పోడు సహా 14 గ్రామాల్లో భూములను ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తీసుకున్నారు
ఏకంగా 8వేల ఎకరాలను ప్రభుత్వం ఈ ప్రాంతంలో సేకరించింది.
(దేశంలో అతిపెద్ద భూ సేకరణల్లో ఇదొకటి)
సెజ్ ల లాభాలు.. నష్టాలు చర్చ పక్కన పెడితే..
సెజ్ ప్రభావిత గ్రామాల్లో ప్రథానమైనది రావివారి పోడు. ఇతర గ్రామాలు లానే త్వరలోనే ఈ గ్రామం కనుమరుగైనా ఆశ్చర్యం లేదు..
అప్పుడు ఈ చెట్టూ వుండదు..
చెట్టుకింది హనుమంతు..
చప్టామీద ముసలి ఒరుగులూ..
ఏవీ ఏవీ వుండవు
అప్పుడు ఈ ఫోటోవు చివరి ఫోటోవు కావొచ్చు..
-- సరిదే నాగ్
నోట్ : కాపీ చేయొద్దు.. షేర్ చేసుకోవచ్చు

No comments:

Post a Comment