Tuesday 12 April 2016

విగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమం

గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సీతారామ లక్ష్మణ, ఆంజనేయ
పాలరాతి విగ్రహాలను తీసుకొచ్చి అధివాస క్రతువులు ప్రారంభించారు..
శిల్పి తయారు చేసిన విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేయడానికి ముందు వాటికి
అధివాస కార్యక్రమాలు చేపడతారు..
జలాధివాసం : విగ్రహాలను ఒక రోజంతా (పగలు రాత్రి) పూర్తిగా జలంలో వుంచుతారు
క్షీరాధివాసం : విగ్రహాలను ఆవు పాలలో వుంచుతారు
ధాన్యాధివాసం : కొత్త ధాన్యంలో విగ్రహాలను నిద్రచేయిస్తారు
పుష్పాధివాసం : పూర్తిగా పుష్పాలలో వుంచుతారు
అనంతరం అధివాస హోమాలు నిర్వహిస్తారు
ప్రాణ ప్రతిష్ట అనంతరం విగ్రహాలను ప్రతిష్ట చేస్తారు..
విగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమం జరుగుతోంది..
--నాగ్
ఫోటో : సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహాలకు జలాధివాసం చేస్తున్న భక్తులు

No comments:

Post a Comment