Saturday 16 April 2016

సముద్రంలో వేట నిషేదం

సముద్ర మత్స్య ప్రియులకి ఒకింత ఇబ్బందే..
ఈనెల 15 నుంచి 45 రోజుల పాటు
కన్యాకుమారి నుంచి కలకత్తా వరకూ ఇదే నిబంధన.
ఆ పిరియడ్ లో సముద్రంలోకి మత్య్సకారులు వేటకు వెళ్లడం నేరం
సో ఆ కాలంలో సముద్రం చేపలు దొరకవు. చెరువు చేపలే దిక్కు..
విషయానికి వస్తే..
ప్రతి సంవత్సరం సముద్రంలో ఈ కాలం లో వేట నిషేదం అమలులో ఉంటుంది
ప్రతి ఏప్రిల్ 15 నుంచీ సముద్రంలోకి వేట బోట్లు వెళ్లడం నేరం
ఆ కాలంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయట. దానికి కనీసం 45 రోజులు పడుతుంది అట.
మర బోట్లు మెకనైజ్ద్ స్టీమర్లు, సముద్రంలోకి వెళ్తే చేపలకు హాని కలుగుతుందని వేటని నిషేదిస్తోంది ప్రభుత్వం.
అయితే సంప్రదాయ నాటు పడవలతో సముద్రంలో కొంత మేర వేటకు అనుమతి వుంది. మిషన్లు వున్న పడవలు వాడకూడదు అంతే..
ఈ నిషేదం కాలంలో మత్య్స కారులు వేటకు వెళ్లితే వారికి రూ.2500వరకూ జరిమానా విధిస్తారు..
పట్టుకున్న చేపల్ని బోటు సహా సీజ్ చేస్తారు. ఒక్కోసారి ఏడాది వరకూ జైలు కూడా వేయొచ్చు.
మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీరంలో పోలీసు, మెరైన్, నావీ పోలీసులు గస్తీ తిరుగుతారు
సుమారు రెండు నెలల పాటు చేపలు పట్టేవారికి ఉపాధి వుండదు.
ఆ కాలంలో ప్రభుత్వం నెలకి రూ.2వేలు, 25 కిలోలు పరిహారంగా అందజేస్తుంది..
ఇది ఏ మాత్రం మత్య్స కారులకి సరిపోదు.. అందుకే దొంగ చాటుగా అయినా వేటకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు.. జరిమానాలు సరే సరి..

సముద్రంలో వేట నిషేదం అమలులో ఉంటుంది.
--నాగ్
ఫోటోలు : ఉప్పాడ జట్టీ దగ్గర పడవను ఒడ్డుకు చేర్చే పని నటిస్తూ..
వేట నిషేదం పై ది హాన్స్ ఇండియా పత్రికలో నా కథనం

No comments:

Post a Comment