Tuesday 12 July 2016

కోనేట్లో ఈ రాయి తేలుతూ కనిపిస్తోంది.

సీతమ్మ లంకలో రావణుని చెరలో వుందని తెలుసుకున్న రాముడు వానర సైన్యంతో లంకపైకి దండయాత్ర చేస్తాడు.
ఆ సమయంలో లంకను చేరుకోడానికి సముద్రం దాటాల్సి వస్తుంది. అపుడు అక్కడ వున్న రాళ్లను సముద్రంలో వేసి వానరుల సాయంతోనే వారధిని నిర్మిస్తాడు రామచంద్రుడు.  తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఆ రాళ్లు మనకు కనిపిస్తాయి. పెద్ద పెద్ద బండలని నీళ్లల్లో వేసినా అవి తేలుతుంటాయి.
ప్రత్యేకమైన స్పాజిల్ తరహా రాళ్లు కావడంతో అవి తేలుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అది వేరే విషయం.
నీటిలో తేలే ఆ రాళ్లు రామేశ్వరంలో మాత్రమే కనిపించేవి. అయితే తూర్పుగోదావరి జిల్లా గాదరాడలో ఓం శక్తి పీఠం వద్ద  ఇటీవల సుమారు 46 ప్రసిద్ద దేవాలయాల నమూనాలను నిర్మించారు.
అక్కడ ఈ రాయిని కూడా సందర్శకుల కోసం వుంచారు.
అక్కడి కోనేట్లో ఈ రాయి తేలుతూ కనిపిస్తోంది. వీలుంటే.. ఆసక్తి వుంటే వెళ్లి చూడండి ఈ నీటిలో తేలే రాయిని
ఇది రాజానగరం జంక్షన్ నుంచి కి. మీ. 13
ధన్యవాదాలు
-- సరిదే నాగ్
ఫోటో : కోనేట్లో తేలుతున్న రాయి
నోట్: నచ్చితే షేర్ చేయండి కాపీ మాత్రం చేయొద్దు

2 comments:

  1. rameswaram lo ammadam modalu pettaru... mana pithapuram kuda tiskuni vaste baguntundemo..

    ReplyDelete