Monday 11 July 2016

తూర్పుగోదావరి జిల్లాలోనూ జ్యోతి దర్శనం

తూర్పుగోదావరి జిల్లాలోనూ జ్యోతి దర్శనం
---------------------------------------------------
జ్యూతి దర్శనం అంటే మనకు గుర్తొచ్చేది కేరళ లోని శబరిమలై అయ్యప్ప జ్యోతి దర్శనం.
అయితే తూర్పుగోదావరి జిల్లాలోనూ భగవానుడు జ్యోతి స్వరూపునిగా దర్శనం ఇచ్చే క్షేత్రం వుందంటే నమ్మగలరా..
అదే కోరుకొండ మండలం కణుపూరు శైవ క్షేత్రం.
ఈ క్షేత్రంలో భ్రమరాంభా సమేత పంచముఖ మల్లికార్జున స్వామి వారు. స్వామి స్వయం భూః లింగం
362 మెట్లు ఎత్తైన కొండపై వెలిశారు. శివలింగం ఫోటోలో చూపిన విధంగా అయిదు ముఖాలతో వుంటుంది.
ఇక్కడి మహత్యం ఏమిటంటే.. ప్రతి శివరాత్రికీ స్వామి వారు జ్యోతి స్వరూపునిగా భక్తులకు దర్శనమిస్తారట.
శివరాత్రి రోజు నుంచి ఇక్కడ అయిదు రోజులు ఉత్సవాలు చేస్తారు. ఈ అయిదు రోజుల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జాము 1 గంటలోగా ఈ జ్యోతి కొండపై కనిపిస్తుందట. ఆ దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొండపైనా, దిగువునా కాచుకుని వుంటారట. అక్కడే మకాం వేసి వుంటారట. జ్యోతి దర్శనం ఎప్పుడు అయితే అప్పటితో శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.
లేదంటే కనిపించే వరకూ అయిదు రోజులపాటు కొనసాగుతాయట.
ఒక కొండపైన స్వామి వెలిశాడు. అక్కడికి చేరుకోవాలంటే సుమారు 362 మెట్లు ఎక్కాల్సిందే.. మరో మార్గం లేదు. మెట్లు ఈ మధ్యనే అభివృద్డి చేశారు.
శివరాత్రి అయిదు రోజులూ కొండంతా జనమే.
మామూలు రోజుల్లో మధ్యాహ్నం వరకూ మాత్రమే ఆలయం వుంటుంది
మిగిలిన సమయాల్లో నిర్మానుష్యమే. ఎవరైనా భక్తులు వస్తే అక్కడ అర్చక స్వామి సెల్ నెంబర్ రాసి వుంటుంది ఫోన్ చేస్తే ఊర్లో నుంచి వస్తారాయన.
ధన్యవాదాలు
-- సరిదే నాగ్
ఫోటో : పంచముఖ మల్లికార్జున స్వామి వారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గం, ఆలయం


No comments:

Post a Comment