Sunday 17 July 2016

భద్రాచలం క్షేత్రంలో శూర్పణక ముక్కు చెవులు కోసిన స్థలం

పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు ఒక్కో ఆలయం వద్ద ఒక్కో ప్రత్యేకత వుంటుంది.
క్షేత్ర పురాణాన్ని బట్టి కూడా నమ్మకాలు  ఏర్పడతాయి.
భద్రాచలం క్షేత్రంలో ఇలాంటివి కొంచెం ఎక్కువే.
రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడే వనవాసం చేశాడనే నమ్మకం వల్ల ఆ ప్రత్యేకతలు వచ్చాయేమో.
ఈ ప్రాంతంలోనే రాముడు పర్ణశాలను నిర్మించుకున్నట్టు చెబుతారు.
ఇదిగో ఈ రాళ్ల గుట్టను చూడండి
ఇక్కడే తొలుత రాముని మోహించి.. ఆపై లక్ష్మణుని వద్దకు వచ్చిన శూర్పణకను  లక్ష్మణుడు ఇక్కడే ముక్కు చెవులు కోసి శిక్షించాడట.
ఇక్కడ చిన్న రాళ్ల గుట్టలోనివి మూడు రాళ్లు తీసుకుని ఏదైనా కోరిక కోరుకుని, రాముని వంటి కష్టాలు మనకు రాకూడదని ప్రార్థించి వెనుకకు తిరిగి ఎడమ చేతితో ఆ మూడు రాళ్లనూ ఈ గుట్టలో పడేలా విసరాలట.
ఇదో నమ్మకం.
ఇక్కడో సాధువు కూర్చుని వుంటాడు. రాళ్లు విసిరాక బొట్టు పెట్టుకుని దక్షణ వేసి రావాలి.
ఏమో ఏ నమ్మకంలో ఏముందో.. అంత దూరం వెళ్లాక చేయడం వచ్చే నష్టం అయితే లేదు కదా అని
నేనూ ఓ మూడు రాళ్లు విసిరాను
ఏం కోరుకున్నానో మాత్రం అడక్కండి..
చెప్పకూడదట.

-- సరిదే నాగ్
ఫోటో :
భద్రాచలం క్షేత్రంలో శూర్పణక ముక్కు చెవులు కోసిన స్థలం ఇదేనట.
నోట్ : నచ్చితే షేర్ చేయండి, కాపీ మాత్రం చేయొద్దు

No comments:

Post a Comment