Monday 11 July 2016

కోరుకొండ.. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని చెబుతారు

కోరుకొండ.. ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని చెబుతారు
ఆలయం దర్శిస్తే దీనిని నిర్మించింది దేవతలు కాకపోయినా.. నిర్మించినవారు దేవతలే అనిపిస్తుంది
సుమారు 370 మెట్లు వున్న కొండపైన ఈ ఆలయం నిర్మించడం నిజంగా అద్భుతమే.
ఆలయం మూడు వైపులా శిల్ప సంపద అబ్బుర పరుస్తుంది.
దశావతారాలు, రామాయణ దృశ్యాలు, నృత్యాలు ఈ గోడలపై చెక్కారు.
ఒక్కో రాయిపై ఒక్కో శిల్పాన్ని చెక్కారు.
జీవం ఉట్టిపడేలా శిల్పాలు వున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో తప్పని సరిగా చూడాల్సిన ఆలయం ఇది.
మెట్లు నిటారుగా చాలా ఇబ్బందిగా వుంటాయి. చాలా చిన్నవి కూడానూ..
ఈ మధ్య ఇనుప పైపులు ఊతంగా ఏర్పాటు చేశారు కానీ గతంలో అవి కూడా వుండేవి కావు.
పైన స్వామి వారి ఆలయం గురించి మరో పోస్టులో 
-- సరిదే నాగ్
ఫోటో : కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం

No comments:

Post a Comment