Saturday 2 September 2017

మట్టి గణపతులనే పూజిద్దాం..

ఓ పదేళ్ల క్రితం వరకూ మా పిఠాపురంలో సుమారు 30 మంది కుమ్మరి కార్మికులు వుండేవారు.
ఇప్పుడు చూస్తే.. ఓ మూడు కుటుంబాల వారు మాత్రమే కుమ్మరి పని చేస్తున్నారు. 
వారిలో ఓ కుటుంబం అయితే అప్పుడప్పుడే ఈ పని చేస్తున్నారు.
అంటే.. ఓ పదేళ్లలో కుమ్మరి పని వారికి ఉపాధిలేక,
కుండలు, కుండీలు, కూజాలు, మట్టి దాకలు, సిబ్బిలు, డిబ్బీలు కొనేవాళ్లు లేక ఆయా కుటుంబాలు ప్రత్యామ్యాయ వృత్తులకు వలస వెళ్లిపోయాయి.
బతకలేక కుల వృత్తిని వాళ్ళు వదులుకున్నారు.
ఓ అందమైన అరుదైన కళ ఇలా కనుమరుగై పోతోంది..
మట్టి నుంచి అపురూప వస్తు సంపదను రూపొందించే వృత్తిదారులు మాయమైపోతున్నారు.
ఈ కళను కాపాడాలంటే కుమ్మరి వృత్తిదారులను ప్రోత్సహించాలి.
వారు తయారు చేసిన వస్తువులు అన్నీ కాకపోయినా..
కనీసం ఏడాదికి ఒక సారి వచ్చే వినాయక చవితికి మట్టి బొమ్మలు
దీపావళీకి మట్టి ప్రమిదలు, చిచ్చుబుడ్లు మట్టివే కొనుగోలు చేయాలి.
దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంలో మన వంతు పాత్ర మనం పోషించడమే కాదు
మాయమైపోతున్న కుమ్మరి వృత్తిని .. ఆ కళని బతికించుకున్నవాళ్లం అవుతాం
......
మట్టి గణపతులనే పూజిద్దాం..
పర్యావరణాన్ని కాపాడుకుందాం..
కుమ్మరి కళను బతికించుకుందాం.. ✍️
-- సరిదే నాగ్

No comments:

Post a Comment