Wednesday 16 September 2015

పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రయాణ గణపతి

పిఠాపురం పాదగయ క్షేత్రంలో అడుగడుగునా విశేషాలు విచిత్రాలు గోచరిస్తాయి..
 ఉదాహరణకి.
ఆలయంలో తొలిగా దర్శనం చేసుకునే వినాయకుడిని గమనిస్తే.. గణనాధుడు మూషికంపై ఆశీనుడై ఎక్కడికో పయనం అవుతున్నట్టుగా దర్శనమిస్తాడు..
సాదారణంగా, చాలా చోట్ల వినాయకుడు పీఠం మీద ఆశీనుడై వుంటే.. ఆయన వాహనం మూషికం పక్కగా వుంటుంది.. కానీ పాదగయ క్షేత్రంలో మాత్రం స్వామి నేరుగా మూషిక వాహనంపైనే ఆశీనుడై..వుంటాడు..  ఈ తరహా విగ్రహం అరుదని ఇక్కడి పండితులు చెబుతున్నారు.. స్వామిని ప్రయాణ గణపతిగా పేర్కొంటున్నారు. 
వీలైతే పాదగయను దర్శించండి.. గణనాధుడి దీవెనలు అందుకోండి..

వినాయక చవితి శుభాకాంక్షలు
--నాగ్

No comments:

Post a Comment